అనంతపురంలో కియా పరిశ్రమలో కార్మికుల మధ్య ఘర్షణ జరిగింది. బంగాల్, తమిళనాడుకు చెందిన కూలీల మధ్య జరిగిన ఘర్షణలో బంగాల్కు చెందిన యువకుడు మృతి చెందాడు. నివాసం ఉండే షెడ్డుకు విద్యుత్ సరఫరాకు సంబంధించి వివాదం ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఘటనపై పెనుకొండ పోలీసులు కార్మికులను విచారిస్తున్నారు. యువకుడి మృతదేహాన్ని పెనుకొండ మార్చురీకి తరలించారు.