న్యూఢిల్లీ: రాకెట్ ప్రయోగాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రస్తుతం మరో మైలురాయిని చేరుకోనున్నది. సెప్టెంబర్ నెల నుంచి పూర్తిస్థాయి వాణిజ్య ప్రయోగాలను చేపట్టేందుకు అవసరమైన సన్నాహాలను చేస్తున్నది. కేవలం విదేశాలకు చెందిన ఉపగ్రహాల కోసం వాణిజ్య ప్రయోగాలు చేపట్టడం ద్వారా ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్లో తన ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాలని భారత్ భావిస్తున్నది. ఈ క్రమంలోనే సెప్టెంబర్లో విదేశీ ఉపగ్రహాల కోసం పీఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో ప్రకటించింది. ఈ ఏడాది ఇప్పటికే పలు ప్రయోగాలు చేపట్టినప్పటికీ విదేశీ ఉపగ్రహాల కోసం వాణిజ్య ప్రయోగాన్ని సెప్టెంబర్లో చేపట్టనున్నామని ఇస్రో చైర్మన్ శివన్ పేర్కొన్నారు.