ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా బైక్ ర్యాలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, May 30, 2023, 11:49 AM

పేద ప్రజలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను శ్మశాన వాటికలతో పోల్చిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కెకె రాజు ఆధ్వర్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి ఆర్ అండ్ బి జంక్షన్ వరకు వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కెకె రాజు మాట్లాడుతూ ఇళ్ళు లేని ప్రతీ పేదవాడికి సొంతిల్లు కల్పించాలనే సదుద్దేశంతో ముఖ్య‌మంత్రి వై. య‌స్ జ‌గ‌న్మోహన్ రెడ్డి నేతృత్వంలో దేశంలో ఎక్క‌డా లేని విధంగా పెద్ద ఎత్తున ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వ‌డంతో పాటు ఇళ్ళు నిర్మించే కార్య‌క్ర‌మం చేపట్టటమే కాకుండా అమ‌రావ‌తిలో 50వేల మందికి ఇళ్ళ ప‌ట్టాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్లు కంపా హనుక్, అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సారిపిల్లి గోవింద్, కార్పొరేటర్లు కె. అనిల్ కుమార్ రాజు, సాడి పద్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com