ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడేళ్ల పాపపై బాలుడు అఘాయిత్యం, చిన్నారి మృతి

national |  Suryaa Desk  | Published : Mon, May 29, 2023, 11:03 AM

మూడేళ్ల చిన్నారిపై 8 ఏళ్ల బాలుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో కాన్పూర్‌లో జరిగింది. చకేరి ప్రాంతంలో నివాసముండే బాలుడు ఇంటి పక్కనే ఉండే చిన్నారికి చాక్లెట్​ ఇస్తానని చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ఆ తర్వాత నేలకోసి కొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చిన్నారిని వెతుక్కుంటూ వచ్చిన ఆమె కుటుంబీకులు రక్తపు గాయాలతో పడిఉన్న బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్సపొందుతూ చిన్నారి మరణించింది. పోలీసులు బాలుడ్ని అరెస్ట్​ చేసి కోర్టు ఆదేశాలతో జువైనల్​ హోంకి తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com