ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

national |  Suryaa Desk  | Published : Fri, May 26, 2023, 08:36 PM

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. వరుసగా రెండో రోజు లాభపడింది. ఫలితంగా ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 629 పాయింట్లు లాభపడి 62,502 వద్ద ముగిసింది. నిఫ్టీ 178 పాయింట్లు పుంజుకుని 18,499 వద్ద నిలిచింది. ఈరోజు పలు ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మన మార్కెట్లు కూడా అదే ఒరవడిని కొనసాగించాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్లు : రిలయన్స్ (2.79%), సన్ ఫార్మా (2.36%), హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ (2.02%), హిందుస్థాన్ యూనిలీవర్ (1.89%), విప్రో (1.85%).


టాప్ లూజర్స్ : భారతీ ఎయిర్‌టెల్ (-0.61%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-0.36%), ఎన్టీపీసీ (-0.03%).


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com