ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని పెషావర్లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఎన్నికల ర్యాలీ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 14 మంది అక్కడికక్కడే మృతి చెందగా, 51 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అవామీ జాతీయ పార్టీకి చెందిన హరూన్ బిలోర్ కూడా ఉన్నాడు. హరూన్ 16 కుమారుడు డానియల్ తీవ్రంగా గాయపడ్డాడు. 2012లో తాలిబన్లు జరిపిన దాడిలో హరూన్ బిలోర్ తండ్రి అవామీ జాతీయ పార్టీ సీనియర్ నేత బషీర్ అహ్మద్ బిలోర్ మృతి చెందాడు. జులై 25న పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.