కృష్ణా : నందిగామలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె బుధవారంతో పన్నెండవ రోజుకు చేరింది. పలు సార్లు అధికారులకు, కార్మికులకు మధ్య జరిగిన చర్చలు శూన్యమయ్యాయి. మున్సిపల్ కార్మికులతో ఆర్డిఒ చర్చలు కుడా విఫలమయ్యాయి. చెత్త ఏరి వేసేందుకు మున్సిపల్ అధికారులు నియమించిన కాంట్రాక్టు కూలీలను పంచాయతీ కార్మికులు అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తత కావడంతో పోలీసులు రంగప్రవేశం చేసి పంచాయితీ కార్మికులను అరెస్టు చేశారు.