తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. అలాగే ఉచిత దర్శనానికి 16గంటల సమయం పడుతోంది. కాగా... టైంస్లాట్, నడక దారిన వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు 16గంటల సమయం పడుతోంది. అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా 3 గంటల సమయం పడుతున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.