ప్రకాశం: జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామం వద్ద లారీని బొలెరో వాహనం ఢీకొంది. దీంతో బొలెరోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కాగా... మృతులు గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఎలీషా, సాయి, పోతురాజుగా గుర్తించారు. నరసరావుపేట నుంచి తిరుపతి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.