విజయవాడ: విజయవాడ దుర్గగుడిలో సామూహిక అక్షరాభ్యాసాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా దుర్గగుడిలో ఉచిత అక్షరాభ్యాసం నిర్వహిస్తున్నారు. అమ్మవారు సరస్వతి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సామూహిక అక్షరాభ్యాసం కోసం పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. మల్లికార్జున మహామండపం హాల్లో అక్షరాభ్యాసం కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అక్షరాభ్యాసానికి కావాల్సిన సామగ్రిని దేవస్థానం ఉచితంగా పంపిణీ చేస్తోంది.