శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో పీడీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేసింది బీజేపీ. పీడీపీతో కలిసి సాగడం ఇక బీజేపీ వల్ల కాదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, జమ్ముకశ్మీర్ ఇన్చార్జ్ రాంమాధవ్ వెల్లడించారు. కశ్మీర్లో ఉగ్రవాదం, హింస పెరిగిపోయిందని, పౌరుల ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగిందని రాంమాధవ్ విమర్శించారు. జర్నలిస్ట్ షుజాత్ బుఖారీ హత్యే దీనికి నిదర్శనమని అన్నారు. దేశ సమగ్రత, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అధికారాన్ని గవర్నర్కు ఇవ్వాలని నిర్ణయించినట్లు రాంమాధవ్ స్పష్టంచేశారు.