న్యూఢిల్లీ : మోడీజీ మీరూ గుజరాత్ సీఎంగా పని చేశారు మరచిపోకండి అంటూ చంద్రబాబునాయుడు నీతి ఆయోగ్ పాలక మండలి సమవేశం వేదికగా వ్యాఖ్యానించారు. దాదాపు 20 నిముషాల పాటు సాగిన చంద్రబాబు ప్రసంగం యావత్తూ కేంద్రంపై విమర్శలూ, జాతీయ అంశాలలో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత, ఏపీకి జరిగిన అన్యాయాలను వివరించడానికే కేటాయించారు. రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఇబ్బందులేమిటీ మీకు తెలియనివి కావు మీరు ముఖ్యమంత్రిగా పని చేశారు గుర్తుంచుకోండి అని చంద్రబాబు అన్నారు.