న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం ముగిసింది. జమిలి ఎన్నికలపై విస్తృత చర్చ, సంప్రదింపులకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, దిగుబడి పెంచే అంశాలపై అధ్యయనానికి ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయంతో ఉపాధి హామీ అనుసంధానంపై అధ్యయనం చేయాలని ఏపీ, బెంగాల్, గుజరాత్, సిక్కిం, బిహార్, యూపీ, మధ్యప్రదేశ్ సీఎంలను ప్రధాని కోరారు.