ఒడిశా: చిలుక సరస్సులో నిన్న రాత్రి పడవ బోల్తాపడింది. సరసు మధ్యలో ఉన్న ఆలయానికి వెళ్లిన భక్తుల పడవ సరస్సులో తిరగబడింది. సరస్సులో నుంచి ఐదు మృతదేహాలను వెలికి తీశారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. ప్రమాదం నుంచి 9 మంది సురక్షితంగా బయటపడ్డారు. మొత్తం 16 మంది ప్రయాణికులతో పడవ బయలుదేరినట్లు సమాచారం.