అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఆర్డీఏపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో మహీంద్రా, షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధులు, ఎల్అండ్టీ, డీఎల్ఎఫ్, జీవీకే తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సాంకేతికతతో అత్యంత ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి వర్సిటీలు, విద్యాలయాలు, ఆస్పత్రులు, హోటళ్లు ఇప్పటికే ఇక్కడికి వచ్చాయన్నారు. కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.