బెంగళూరు: చిన్నస్వామి మైదానం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. ఎన్నో ఆశలు పెట్టుకొన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (12; 17 బంతుల్లో 4×2) ఔటవ్వడమే కారణం. లియాన్ వేసిన 33.5వ బంతికి విరాట్ ఎల్బీ అయ్యాడు. బంతి స్పిన్ తిరుగుతుందని భావించిన కోహ్లీ బ్యాట్ పైకెత్తాడు. ఐతే బంతి తిరగకుండా నేరుగా వచ్చి కోహ్లీ ప్యాడ్లను తాకింది. ఫ్లాట్ వికెట్పైనా దూకుడు కనబరచలేకపోతున్న టీమిండియాకు ఇది పెద్ద దెబ్బే! భోజన విరామం ముందు పుజారా వెనుదిరిగడంతో క్రీజులోకి వచ్చిన కోహ్లీని ఆసీస్ బౌలర్లు లక్ష్యంగా పెట్టుకొన్నారు
ప్రేక్షకుల కేరింతల మధ్య క్రీజులోకి అడుగుపెట్టిన కోహ్లీ ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. ఐతే 31వ ఓవర్ విసిరిన మిచెల్ స్టార్క్ పదునైన బౌన్సర్లు, గుడ్లెంగ్త్ బంతులతో కోహ్లీని లక్ష్యంగా చేసుకొన్నాడు. ఈ ఓవర్లో బౌన్సర్గా వచ్చిన ఐదో బంతిని ఆడిన విరాట్ను చూసి మైదానమంతా నిశ్శబ్దంగా మారింది. ఐతే ఆ తర్వాత బంతికి బౌండరీ బాదీ అభిమానులను సంతోష పెట్టాడు కోహ్లీ.