విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైందని ఎంపి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. మహానాడులో దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వైకాపా అధ్యక్షుడు జగన్పై తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్కు వాళ్ల తాత బుద్ధులు వచ్చాయని జెసి అన్నారు. వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రధాని నరేంద్ర మోడీనుంచి 1500 కోట్ల రూపాయిలు తీసుకున్నారని ఎంపి జెసి దివాకర్ రెడ్డి అన్నారు. మహానాడులో జెసి మాట్లాడుతూ 2019లో జరిగే ఎన్నికల కోసం మోడీనుంచి జగన్ ఈ నిధులు తీసుకున్నారని ఆరోపించారు. తనను వైకాపాలో చేరమని అడిగారని, దీనికోసం విజయసాయిరెడ్డిని తన వద్దకు రాయబారం పంపారని ఆయన చెప్పారు. జగన్ కింద ఊడిగం చేయడం తనకు ఇష్టం లేదని ఆయన స్పష్టం చేశారు. జగన్కు చంద్రబాబును తిట్టడమే పని అని ఆయన అన్నారు. తెలుగుదేశం మహానాడులో మాట్లాడుతూ ఎంపీ జేసీ దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల కోసం జగన్ ప్రధాని మోడీ వద్ద నుంచి 1500 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తనను వైకాపాలో చేరాల్సిందిగా జగన్ విజయసాయిరెడ్డి ద్వారా రాయబారం పంపాడని జేపీ తెలిపారు. అయితే జగన్ కింద ఊడిగం చేయడం తనకు ఇష్టం లేదని అన్నారు. చంద్రబాబు అనుభవం ఉన్న, ప్రజా శ్రేయస్సు పట్ల చిత్తశుద్ధి ఉన్న నాయకుడని జేపీ పేర్కొన్నారు. ఆయన ప్రధాని కావాలని ఆకాంక్షించారు. లోకేష్ మంత్రి అయితే తప్పేమిటని ప్రశ్నించారు.