లక్నో : ఉత్తర్ ప్రదేశ్లోని యాంటి టెర్రరిజమ్ స్క్వాడ్ (ఎటిఎస్)లో అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పని చేస్తున్న రాజేశ్ సాహ్ని తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన కార్యాలయంలోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. రాజేశ్ సాహ్ని గదిలో సూసైడ్ నోట్ ఏదీ పోలీసులకు లభ్యం కాలేదు. రాజేశ్ మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు చెప్పారు.