విజయవాడ: మూడు రోజులపాటు విజయవాడలో జరిగే తెలుగుదేశం పార్టీ మహానాడుకు 2వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నగరంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వలంటీర్ల సేవలను వినియోగించుకుంటామని, మహానాడుకు వచ్చే ప్రముఖులకు ప్రత్యేక భద్రత కల్పిస్తున్నట్లు సీపీ తెలిపారు. కాగా... ఈ నెల 27, 28, 29 తేదీలలో మూడు రోజులపాటు టీడీపీ 27వ మహానాడు జరుగుతుంది. విజయవాడ కానూరులోని వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్స్లో ఈ మహానాడు జరగనుంది