బెంగళూరు : కర్నాటకలో బీజేపీ సర్కార్ మూడు నాళ్ల ముచ్చటేనని ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి గవర్నర్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శించారు. గోవా, మణిపూర్ లలో బీజేపీ ప్రభుత్వాలు ఎలా ఏర్పాటయ్యాయో గమనిస్తే…అదే పరిస్థితి ఇక్కడ వచ్చినప్పుడు అందుకు భిన్నంగా గవర్నర్ వ్యవహరించి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించారని విమర్శించారు. కచ్చితంగా అసెంబ్లీలో యెడ్యూరప్ప బలనిరూపణలో విఫలమౌతారని రఘువీరా అన్నారు.