విజయవాడ: జగన్, వైసీపీ సభ్యులు పరుష పదజాలం వాడటాన్ని మానుకోవాలని అధికారుల సంఘం సూచించింది. వ్యక్తి స్వేచ్ఛ ఇతర మనోభావాలు గాయపరిచేలా ఉండొద్దని, ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకున్నది ప్రభుత్వ ఉద్యోగులను తిట్టడానికా? అంటూ వారు ప్రశ్నించారు. ఉద్యోగులు వెధవలని శ్రీకాంతరెడ్డి అనడం చాలా బాధాకరమని అన్నారు. మమ్మల్ని బెదిరించి విధి నిర్వహణకు అడ్డుపడుతున్నారని పోలీసు అధికారులు ఆరోపించారు. వైసీపీ నేతల తీరును నిరసన వ్యక్తం చేస్తూ నల్లబ్యాడ్జిలతో విధులకు హాజరవుతామని సంఘం తెలిపింది. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలతో వైఎస్ ఆత్మ క్షోభిస్తుందని పోలీసు అధికారుల సంఘం పేర్కొంది. జగన్, వైసీపీ నేతలు తమకు క్షమాపణలు చెప్పాలని పోలీసు అధికారుల సంఘం డిమాండ్ చేసింది.