అమరావతి : అసెంబ్లీ ప్రారంభ కార్యక్రమానికి ఇతర పార్టీల నేతలు కూడా వస్తే బాగుండేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీ భవన సముదాయాలను ప్రారంభించిన ఆయన అనంతరం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రం నడిబొడ్డున రాజధాని ఉండాలనే ఇక్కడికి వచ్చామన్నారు. భూమిపై మమకారం ఉండే ప్రాంతం అయినప్పటికీ రైతులు ముందుకొచ్చి 34వేల ఎకరాలు ఇచ్చారని పేర్కొన్నారు. భూసమీకరణను రాజకీయం చేయాలని చంద్రబాబు అన్నారు.