విజయవాడ : వైకాపా అధినేత, ఏపీ విపక్ష నేత జగన్ హైదరాబాద్ బయలుదేరారు. ఈ రోజు ఉదయం గన్నవరం నియోజకవర్గం వెంకటరామాపురం వద్ద తన 146వ రోజు పాదయాత్ర ప్రారంభించిన జగన్ ఇందపల్లి మీదుగా నందమూరు గ్రామం చేరుకున్నారు. అక్కడ ఈ రోజు పాదయాత్ర ముగించారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర ముగిసింది. రేపు శుక్రవారం కావడంతో ఆయన హైదరాబాద్ లో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. దాంతో జగన్ ఈ రోజు తన పాదయాత్రను త్వరగా ముగించుకున్నారు. నందమూరు గ్రామం నుంచి గన్నవరం చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ కు బయలు దేరారు. తిరిగి శనివారం ఉదయం నందమూరు గ్రామం వద్ద నుంచి తన 147వ రోజు పాదయాత్ర ప్రారంభిస్తారు.