ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్ బయలుదేరిన జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Apr 26, 2018, 11:53 AM

విజయవాడ :  వైకాపా అధినేత, ఏపీ విపక్ష నేత జగన్ హైదరాబాద్ బయలుదేరారు. ఈ రోజు ఉదయం గన్నవరం నియోజకవర్గం వెంకటరామాపురం వద్ద తన 146వ రోజు పాదయాత్ర ప్రారంభించిన జగన్ ఇందపల్లి మీదుగా నందమూరు గ్రామం చేరుకున్నారు. అక్కడ ఈ రోజు పాదయాత్ర ముగించారు. దీంతో గన్నవరం నియోజకవర్గంలో ఆయన పాదయాత్ర ముగిసింది. రేపు శుక్రవారం కావడంతో ఆయన హైదరాబాద్ లో కోర్టుకు హాజరు కావాల్సి ఉన్న విషయం తెలిసిందే. దాంతో జగన్ ఈ రోజు తన పాదయాత్రను త్వరగా ముగించుకున్నారు. నందమూరు గ్రామం నుంచి గన్నవరం చేరుకుని అక్కడ నుంచి హైదరాబాద్ కు బయలు దేరారు. తిరిగి శనివారం ఉదయం నందమూరు గ్రామం వద్ద నుంచి తన 147వ రోజు పాదయాత్ర ప్రారంభిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com