ఉత్తరప్రదేశ్: రాష్ట్రంలోని కుషీనగర్లో రైల్వే క్రాసింగ్ వద్ద ఘోర ప్రమాదం జరిగింది. విదార్థులతో వెళుతున్న వాహనాన్ని గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో 11 మంది విద్యార్థులు మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో గాయపడిన మరో ఐదు మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.