కృష్ణా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి 138వ రోజు ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. జగన్ తన 138వ రోజు పాదయాత్రను జి.కొండూరు మండలం ముత్యాలపాడు క్రాస్ నుంచి ప్రారంభించారు. పాదయాత్ర ఆత్కూరు, చెవుటూరు క్రాస్, కుంటముక్కల క్రాస్, గుర్రాజులపాలెం క్రాస్ మీదుగా మైలవరం వరకు కొనసాగనుంది. పాదయాత్రలో భాగంగా సాయంత్రం మైలవరంలో జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు.