న్యూఢిల్లీ: మనీ ల్యాండరింగ్ కేసులో ఢిల్లీ మంత్రి సత్యేంద్రజైన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. పీఎంఎల్ఏ యాక్ట్ కింద సత్యేంద్రజైన్కు సమన్లు జారీ చేశామని..దర్యాప్తు అధికారితో జైన్ వాంగ్మూలం రికార్డు చేస్తామని ఈడీ అధికారి ఒకరు తెలిపారు. మంత్రి సత్యేంద్రజైన్ షేర్ హోల్డర్గా ఉన్న నాలుగు కంపెనీల నుంచి నిధులు వచ్చిన అంశంపై వివరణ ఇవ్వకపోవడంతో.. సీబీఐ సత్యేంద్రజైన్, అతని భార్యతోపాటు మరో నలుగురిపై గతేడాది ఆగస్టులో కేసు నమోదు చేసింది. 2015-16 సంవత్సరంలో ప్రయాస్ ఇన్ఫో సొల్యూషన్స్, అకించన్ డెవలపర్స్, మనగల్యాతన్ ప్రాజెక్ట్సు అండ్ ఇండో మెటల్ ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల నుంచి అక్రమంగా రూ.4.63 కోట్లు నిధులు పొందారని సత్యేంద్రజైన్పై ఆరోపణలున్నాయి.