బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రభుత్వ పని తీరు మెరుగ్గా ఉందని అక్కడి ఓటర్లు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పని తీరుపై నిర్వహించిన ఒక సర్వేలో 10 పాయింట్లకుగాను సిద్ధరామయ్య ప్రభుత్వానికి 7 పాయింట్లు వచ్చాయి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, దక్ష అనే సామాజిక సంస్థ సంయుక్తంగా 225 శాసనసభ నియోజక వర్గాల్లో ఈ సర్వే నిర్వహించాయి. వివిధ అంశాలకు వచ్చిన పాయింట్లు ఈ కింది విధంగా ఉన్నాయి. పాఠశాలలు 7.58, విద్యుత్ సరఫరా 7.56, ఆహార పంపిణీ రాయితీ 7.35 పాయింట్లు రాగా, ఉపాధి అవకాశాల విషయంలో 6.70, అవినీతి నిర్మూలన 6.67 పాయింట్లు వచ్చాయి. మొత్తంగా ప్రభుత్వ పని తీరుకు 7.05 పాయింట్లు లభించాయి.