పశ్చిమగోదావరి : పోలవరం మండలం శివగిరిలో విషాదం నెలకొంది. గోదావరిలో స్నానానికి దిగి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. మృతదేహాలను శివగిరి గ్రామస్థులు వెలికితీశారు. మృతులు ఛత్తీస్గఢ్ వాసులై ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న పాపికొండలు సందర్శనకు 10 మంది పర్యాటకులు వెళ్లారు. శివగిరిలోని కాటేజీలో ఈ పర్యాటకలు బస చేసినట్లు తెలుస్తుంది.