చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మారుస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. వంద పడకల ఆసుపత్రిగా మార్చడానికి టెండర్లు పిలిచామని ఆయన అన్నారు. చిలుకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో డిజిటల్ ఎక్స్రే యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు ఉచితంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే చిరుమామిళ్ల ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా చేయడానికి టెండర్లు పిలిచామన్నారు.