అమరావతి :ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అఖిల సంఘాల సదస్సు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన హామీల విషయంలో బీజేపీ ఇంత వరకూ చేసిందేమిటి? హామీల అమలు విషయంలో అనుసరిస్తున్న వైఖరి, ఇప్పటి వరకూ కేంద్రం నుంచి విడుదలైన నిధులు, ఇవ్వాల్సిన నిధులు తదితర విషయాలపై ఈ భేటీలో చర్చిస్తారు. అందరి సూచనలతో తుది నిర్ణయం తీసుకునేందుకే అఖిల సంఘం సమావేశం నిర్వహిస్తున్నట్లు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రధాన ప్రతిపక్షం వైకాపా, జనసేన, బీజేపీలు గైర్హాజరయ్యాయి. కాగా ఈ సమావేవం ప్రారంభం కాగానే సీఎం చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రానికి బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని, ఆ విషయంలో అన్ని పార్టీలకూ ఒక స్పష్టతకు వచ్చాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి అన్నీ ఇచ్చేశాం, విభజన హామీలను అమలు చేసేస్తున్నాం, చాలా నిధులు ఇచ్చాం అంటూ బీజేపీ చెబుతున్న నేపథ్యంలో ఈ అఖిల సంఘాల సమావేశంలో వాస్తవాలను తెలిపి ఏం చేయాలన్నది అందరి సూచనలతో నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు అన్నారు.