న్యూఢిల్లి : రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. తొలిసారి 15 నిముషాలపాటు వాయిదా పడిన రాజ్యసభ సమావేశం తిరిగి ప్రారంభమైంది. తమిళనాడు ఎంపిలు కావేరీ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమ స్థానాలలో నిలబడి నినాదాలు చేస్తూ గందరగోళం సృష్టించారు. ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.