లక్నో : ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘోరం జరిగింది. మురికివాడలోని ఆశైన కాలనీలో సోమవారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో 100కు పైగా గుడిసెలు కాలి బూడిదయ్యాయి. బాధిత కుటుంబాలు అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసింది. కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధితులు బోరున విలపిస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.