గుంటూరు : పార్లమెంటు సభ్యత్వాలకు రాజీనామాలు చేయాలనే తమ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని వైకాపా ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి చెప్పారు. వైకాపా అధినేత జగన్తో సమావేశం ముగిసిన తరువాత మేకపాటి విలేకరులతో మాట్లాడారు. రాజీనామా నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని, స్పీకర్ ఫార్మెట్లో రాజీనామా చేస్లామని ఆయన చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా)కు బిజెపితో లోపాయికారీ ఒప్పందమేమీ లేదని ఆ పార్టీ స్పష్టం చేశారు. తాము బిజెపితో కలిసి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. ఇన్నాళ్లకు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తమ పార్టీ అధినేత జగన్ మార్గంలోకి వస్తున్నారని ఆయన చెప్పారు. పార్లమెంటులో టిడిపి ఎంపిలు కూడా తమతో కలిసి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.