ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రేమికలపై దాడి అని ఫోన్...చివరికి కథ సుఖాంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 04, 2022, 09:39 PM

పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఇనిమెళ్లకి చెందిన పాపారావు అనే యువకుడు.. విప్పార్లరెడ్డి పాలెంకు చెందిన ఓ యువతి ఐదు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కానీ.. పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో వారిని ఎదురించి అయినా పెళ్లి చేసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఇదే విషయం మాట్లాడుకోవడానికి రొంపిచర్ల బస్టాండ్ దగ్గర కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత.. ఇద్దరు కలిసి బైక్‌పై నరసరావుపేట  వైపు వెళ్తున్నారు. ఈ సమయంలో.. వారిపై దుండగులు దాడి చేశారు.


రొంపిచర్ల మండలం తుంగపాడు వద్ద సాయంత్రం ఆరున్నర.. 7 గంటల సమయంలో.. ప్రేమికులపై దాడి చేసి.. ఆ అమ్మాయిని పక్కనే ఉన్న సుబాబుల తోటలోకి ఎత్తుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అమ్మాయి ఆచూకీ కోసం రంగంలోకి దిగారు. నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ నేతృత్వంలో.. ఒక సీఐ, ముగ్గురు ఎస్సైలు మూడు బృందాలుగా ఏర్పడి అమ్మాయి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. ఘటన జరిగిన తెల్లారి.. సదరు అమ్మాయి గుంటూరు నుంచి పోలీసులకు ఫోన్ చేసింది. రాత్రి 7 గంటలకే తాను గుంటూరు వచ్చానని చెప్పింది.


దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు మీ స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని అడగ్గా.. తానే వచ్చి ఇస్తానని చెప్పినట్టు.. నరసరావుపేట డీఎస్పీ విజయ భాస్కర్ వెల్లడించారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో.. ప్రేమికుడు పాపారావుపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కావాలనే పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని అభిప్రాయపడుతున్నారు. అసలు ఏం జరిగిందో.. యువతిని అడిగాక తదుపరి చర్యలు తీసుకుంటామని.. డీఎస్పీ విజయ భాస్కర్ స్పష్టం చేశారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com