న్యూఢిల్లీ : ఇరాక్ లో కిడ్నాపైన 39 మంది భారతీయులూ కిడ్నాపర్ల చేతిలో హత్యకు గురయ్యారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సభలో చేసిన ప్రకటనతో దేశం మొత్తం విషాదంలో నిండిపోయిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ఎంపీ శశిథరూర్ అన్నారు. సభ వాయిదా పడిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ వారంతా ప్రాణాలతో ఉన్నారని ఇంత కాలం చెబుతూ వచ్చి బాధితల కుటుంబాలలో ఆశలు నింపారన్నారు. ముందుగానే ఈ విషయాన్ని ప్రకటించి ఉండాల్సిందని శశిథరూర్ అన్నారు.