ముంబై: ముంబైలో రైల్ రోకో ముగిసింది. ఆందోళనకారులతో రైల్వే అధికారులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. రైల్వే అధికారుల చర్చలు సఫలమవడంతో ఆందోళనకారులు తమ ఆందోళనను విరమించారు. ఆందోళన విరమించడంతో రైల్వే అధికారులు సర్వీసులను పునరుద్దరించారు. రైల్వేలో ఉద్యోగాలు కల్పించాలంటూ విద్యార్థులు ముంబైలో ఆందోళన చేశారు. రైల్వే ట్రాక్లపై విద్యార్థులు కూర్చొని రైళ్ల రాకపోకలను అడ్డుకున్నారు.