దాణా కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ను దోషిగా, మరొక మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రాను నిర్దోషిగా ప్రకటించడంపై ఆర్జేడీ నేత రఘువంశ్ ప్రసాద్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మధ్య సంబంధ బాంధ్యవాల ఫలితమే మిశ్రా బైటపడటమని ఆయన వ్యాఖ్యానించారు. ”ఒకే కేసులో ఒకరికి జైల్, మరొకరికి బెయిల్, ఇదీ మోడీ ఖేల్” అని రఘవంశ్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.