న్యూఢిల్లీ : రోజుకో గెటప్పుతో వినూత్న తరహాలో కేంద్రంపై తన నిరసనను వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ ఈ రోజు సామాన్య గృహిణివేషధారణలో పార్లమెంటు ఆవరణలో తన నిరసన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ విధానాలు, నిర్ణయాల వల్ల దేశంలోని మహిళలు ఎన్నో ఇబ్బందుకుల ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. మహిళల ఒంటి మీదుండే బంగారు నగలపై కూడా మోడీ కన్నేశారనీ ఆరోపించారు. దీంతో మహిళలు ప్రధానిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని శివప్రసాద్ పేర్కొన్నారు.