ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరో ప్రతిష్టాత్మక కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి శ్రీకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 01, 2017, 12:20 AM

విజయవాడ, సూర్య బ్యూరో :  మరో ప్రతిష్టాత్మక ఎత్తిపోతల పథకానికి రాష్ర్ట ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. భారీ వర్షాలు, వరదల సమయంలో కొండవీటి వాగు పరిసర ప్రాంతాలు ముంపునకు గురవడాన్ని నిరోధించడం కోసం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. కొండవీటి వాగు కష్ణానదిలో కలిసే ప్రదేశంలో ఈ ఎత్తిపోతల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా జలవనరుల శాఖ అధికారులు సీతానగరంలోని పీడబ్లూ్యడి వర్‌‌క షాప్‌ సమీపంలో ఎత్తిపోతల నిర్మాణానికి శంకుస్థాపన చేయించాలని నిర్ణయించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందని జిల్లా జలవనరులశాఖ అధికారులు ప్రకటించారు. ఆరు నెలల కాలంలో ఈ పథకాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రెండొందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఎత్తిపోతల పథకంలో 16 శక్తివంతమైన పంపులు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందుకు అవసరమైన విద్యుత్‌ అవసరాల కోసం ఓ సబ్‌ స్టేషన్‌ను కూడా నిర్మించబోతున్నారు. గుంటూరు జిల్లా పేరేచర్లకు సమీపంలోని కొండవీడు కొండలలో పుట్టిన కొండవీటి వాగు అక్కడి నుంచి తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలోని మేడికొండూరు, తాడికొండ, తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో ప్రవహించి, ఉండవల్లి గ్రామం పరిధిలోని ప్రకాశం బ్యారేజ్‌ ఎగువున కష్ణానదిలో కలుస్తుంది. దాదాపు 30 కిలోమీటర్ల దూరం పాటు సాగే ఈ ప్రయాణంలో కొండవీటి వాగుకు ఎరవ్రాగు, కోటెళ్ల వాగు, పాలవాగు వంటి చిన్న వాగులు జతకలుస్తాయి. దీంతో వరదలు, భారీ వర్షాలు కురిసే సమయంలో 22 వేల క్యూసెక్కుల గరిష్ట నీటి మట్టానికి వరద నీరు వస్తుందని జలవనరులశాఖ అధికారుల అంచనా. ఇదే జరిగితే వాగు పరిసర ప్రాంతాల్లోని దాదాపు 13,500 ఎకరాలు నీట మునుగుతాయని అంచనా. ఈ ప్రాంతంలోనే రాజధాని నిర్మాణం జరుగుతుండటంతో భవిష్యత్తు భయాలను దష్టిలో ఉంచుకుని ముంపు నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొండవీటి వాగు వరద నీటిలో ఐదు వేల క్యూసెక్కుల నీటిని కష్ణాడెల్టా ఆయకట్టుకు ఉపయోగపడేలా ప్రకాశం బ్యారేజీ ఎగువకు ఎత్తిపోయాలని నిర్ణయించారు. ఇందుకుగానూ రూ.237 కోట్లతో ఉండవల్లి వద్ద ఎత్తిపోతల పథకానికి అంచనాలు రూపొందించారు. టెండర్లు పిలిచిన అనంతరం మెగా ఇంజినీరింగ్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్గ రూ. 222.44 కోట్లకు కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ పథకం కారణంగా దాదాపు రెండు టీఎంసీల వరద నీటిని కష్ణానదిలోకి ఎత్తిపోసి ఆ నీటిని అవసరాన్ని బట్టి డెల్టాకు ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో పాటు 10,600 ఎకరాల నివాస ప్రాంతాలను ముంపు బారి నుంచి రక్షించుకోవచ్చని భావిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com