న్యూఢిల్లీ: అంతర్జాతీయ సౌరశక్తి కూటమి సదస్సు న్యూఢిల్లీలో ఘనంగా ప్రారంభమైంది. భారత్, ఫ్రాన్స్ సంయుక్తంగా ఈ సౌరశక్తి కూటమి సదస్సును నిర్వహిస్తున్నాయి. ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ సదస్సులో పాల్గొన్నారు. వీరితో పాటు 23 దేశాల అధినేతలు సదస్సుకు విచ్చేశారు. రాష్ట్రపతి భవన్ కన్వెన్షన్ సెంటర్లో సౌరశక్తి కూటమి సదస్సు నిర్వహణ జరుగుతుంది. సౌరవిద్యుత్కు మరింత ప్రాచుర్యం కల్పించే అంశాలపై ప్రధానంగా సదస్సు దృష్టి సారించనుంది. ఆస్ట్రేలియా, యూఏఈ, నైగర్, రువాండా, ఫిజీ, బంగ్లాదేశ్, శ్రీలంక, సిషెల్స్, ఘనా, మడగాస్కర్, మలావీ, మారిషస్, వెనిజువెలా, గాబన్ తదితర దేశాధినేతలు హాజరయ్యారు. సౌరశక్తి కూటమి సదస్సు నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.