ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 11, 2018, 03:04 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యాయి. ఏపీలో ఖాళీ అయిన మూడు రాజ్యసభ స్థానాలకు నామినేషన్ దాఖలుకు రేపటితో గడువు ముగియనుంది. శాసనసభలో బలబలాలను బట్టి టీడీపీకి రెండు, వైసీపీకి ఒక స్థానం దక్కుతుంది. అయితే టీడీపీ తమ సభ్యుల పేర్లను ఆదివారం మధ్యాహ్నం ప్రకటించింది. మొన్నటి వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగిన సీఎం రమేశ్‌ కు మళ్లీ అవకాశం వచ్చింది. మరో అభ్యర్థిగా ఏపీ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడిగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్ పేరు ఖరారైంది. ఇప్పటికే వైసీపీ తరపున వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com