ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజ్యసభ సీట్లపై టిడిపి కసరత్తు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 10, 2018, 09:58 AM

  అమరావతి: రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్‌కు సోమవారంతో గడువు ముగయనందున టిడిపిలో రాజ్యసభ సభ్యుల ఎంపిక ఉత్కంఠగా మారింది.దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ అధ్యక్షులు కళా వెంకట్రావు, ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడుతో శనివారం చర్చించారు. రెండు సీట్లలోనే పోటీ చేయాలని టిడిపి భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఒకవైపు రెడ్డి సామాజిక వర్గం, మరోవైపు బిసి,ఎస్సి నేతలు రాజ్యసభ సీట్ల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.రాజ్యసభ సభ్యుల ఎంపికతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులను కూడా భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మొదట మూడుసీట్లలో టిడిపి పోటీ చేయాలని భావించినప్పటికీ రాజకీయ కారణాలతో రెండుసీట్లకే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ ప్రాంతం నుంచి రెడ్డి సామాజిక వర్గానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని ఇప్పటికే పలువురు మంత్రులు సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. మూడో సీటు కోసం ఇప్పటికే వైసిపి తన అభ్యర్థిని ప్రకటించిన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com