జుంజును : ప్రతి అత్తా ఇంట్లో ఆడపిల్ల కావాలనుకుంటే ఎవరూ అవాంతరాలు సృష్టించలేరని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్థాన్లోని జుంజునులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆడపిల్లలను కనడం పెంచడం భారం కాదని మోడీ చెప్పారు. అనేకమంది అమ్మాయిలు మనమంతా గర్వపడేలా కృషి చేస్తూ దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకు వస్తున్నారని ఆయన అన్నారు. అనేక రంగాల్లో అమ్మాయిలు తమ ప్రతిభ చూపుతున్నారని ఆయన ప్రశంసించారు. చిన్నతనంనుంచి పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం అత్యవసరమని ఆయన చెప్పారు.