ఢిల్లీలోని రాంజాస్ కాలేజీ వివాదం మరింత ముదురుతోంది. నిన్నటి ఏబీవీపీ ర్యాలీకి పోటీగా ఇవాళ ఎన్.ఎస్.యు.ఐ, జె.ఎన్.యు ఉపాధ్యాయ, విద్యార్ధి సంఘాలు ర్యాలీ నిర్వహిస్తున్నాయి. ఖల్సా కాలేజీ నుంచి ర్యాలీగా బయల్దేరిన ఉపాధ్యాయులు, విద్యార్ధులు, ఏబీవీపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సేవ్ ఢిల్లీ యూనివర్సిటీ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. జెఎన్యూ విద్యార్థి నేత కన్హయ్య కుమార్ కూడా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. విద్యార్ధి సంఘాలకు మద్దతుగా కాంగ్రెస్ కూడా ఆందోళనలో పాల్గొంది. ఢిల్లీ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ బయట ఎన్.ఎస్.యు.ఐ నిరాహార దీక్షను చేపట్టింది. డీయూలో శాంతిని నెలకొల్పాలంటూ నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు స్టూడెంట్స్.