ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాన్సస్‌ లోని డిస్ట్రిక్ట్ కోర్టులో ఆడమ్‌ ప్యూరింటన్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 28, 2017, 03:44 PM

అమెరికాలో శ్రీనివాస్ కూచిభొట్లను హత్య చేసిన నిందితుడు ఆడమ్‌ ప్యూరింటన్‌ ను కాన్సస్‌ లోని డిస్ట్రిక్ట్ కోర్టులో హాజరుపరిచారు. అతనితో పాటు కాల్పులు జరిపిన వీడియో ఫుటేజీని కూడా కోర్టు ముందు ఉంచారు పోలీసులు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు ఆడమ్ ఎలాంటి భయం లేకుండా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అతనిలో ఎలాంటి పశ్ఛాత్తాపం కూడా కన్పించలేదు. విచారణ అనంతరం అతన్ని జాన్సన్‌ కౌంటీ జైలుకు తరలించారు. ప్యూరింటన్ జాత్యహంకార నేరానికి పాల్పడినట్టు డిస్ట్రిక్ట్ కోర్టులో దోషిగా తేలితే.. 50 ఏళ్లు జైలు శిక్షపడే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com