ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ, కాంగ్రెస్ లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 28, 2018, 12:17 PM

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఏపీ ముఖ్యమంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు. దేశంలో ఎవరికైనా, ఏ రాష్ట్రనికైనా అన్యాయం జరిగితే... దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లే బాధ్యత వహించాలని చెప్పారు. ఈ రెండు పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే... దేశానికి మంచిది కాదని అన్నారు. ప్రత్యేక హోదా రాయితీలను ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు, ఏపీకి కూడా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. రానున్న ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చంటూ భవిష్యత్ రాజకీయాలపై పరోక్ష సంకేతాలను పంపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com