న్యూఢిల్లి : అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామ మందిర నిర్మాణం కోసం ఇవ్వాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్ ముస్లింలకు విజ్ఞప్తి చేశారు. వివాదాస్పద భూమిలో ‘నమాజ్’ చేయడం ఖురాన్, ఇస్లామిక్ చట్టాల ప్రకారం ‘పాపం’ అవుతుందని ఆయన చెప్పారు. వారణాశిలో జరిగిన సంత్ సమాగమంలో రవిశంకర్ మాట్లాడుతూ అయోధ్య వివాదానికి సంబంధించి ఇరు వర్గాల మధ్య చర్చలు సానుకూల ధోరణిలో సాగుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు తీర్పునకు ముందే ఒక పరిష్కారం లభించవచ్చునని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.