జమ్మూకశ్మీర్ : జమ్మూకశ్మీర్ ఉన్నతాధికారులు పలు జిల్లాల్లో ఆకస్మిక హెచ్చరికలు జారీచేశారు. అధిక ఎత్తున్న ప్రాంతాల్లో మంచుచరియలు విరిగిపడే అవకాశమున్నట్లు ఎస్ఏఎస్ఈ సెంటర్ నుంచి సమాచారం వచ్చిందని ప్రభుత్వ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్మూ-శ్రీనగర్ హైవే సహా బారాముల్లా, గుల్మార్గ్, ఫర్కియాన్-జెడ్ గలి, కార్గిల్, లేహ్ జిల్లాలతోపాటు కుప్వారా-చౌకిబాల్-టంగ్దర్, కుల్గామ్, బద్గామ్, కుప్వారా, బందిపొరా, గండేర్బాల్ కార్గిల్, బందిపొరా-కంఝాల్వాన్-గురేజ్ సెక్టార్, లడక్, ఫూంచ్, రాజౌరీ, రియాసి, రాంబన్, దోడ, కిష్త్వార్, ఉదంపూర్ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న 24 గంటలపాటు మంచుచరియలు విరిగిపడే అవకాశమున్న ప్రాంతాలు విపత్తు నిర్వహణ బృందాల పర్యవేక్షణలో ఉంటాయన్నారు.