2021 సంవత్సరం నాటికి 21 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కియా మోటార్స్ సంస్థ అధ్యక్షుడు పార్క్ అన్నారు. పెనుకొండలో కియా పరిశ్రమలో కార్ల తయారీ కేంద్రం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. కియా మోటార్స్ సోదర సంస్థ ముందాయ్ ప్లాంట్ 1996లో చెన్నైలో ఏర్పాటైందని, ఇప్పుడు ఏపీలో కియా మోటార్స్ ఏర్పాటవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు. 10వేల మందికి ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యమన్నారు. కియా మోటార్స్ ద్వారా సామాజిక కార్యక్రమాలు చేపడుతామన్నారు. కియా మోటార్స్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరవలేనిదని ఈ సందర్భంగా కియా అధ్యక్షుడు పార్క్ పేర్కొన్నారు. ప్రజలు, అధికారులు మంచి సహకారం అందిస్తున్నారన్నారు.