విజయవాడ: మంత్రి నారా లోకేశ్ కృష్ణా జిల్లా ఉంగుటూరులో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఉంగుటూరు మండలంలో రూ.42 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఉంగుటూరులో బుడమేరు వంతెన నిర్మాణానికి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి, ఉంగుటూరు జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో నూతన భవనానికి మంత్రి లోకేశ్ శంకుస్థాపనలు చేశారు. అలాగే ఉంగుటూరు చెరువు సుందరీకరణ పనులను లోకేశ్ ప్రారంభించారు.